Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ధరిత్రి చిన్నబోయింది.. గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

Webdunia
గురువారం, 28 మే 2020 (11:24 IST)
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు నివాళులు అర్పించారు. మనువళ్ళు అయిన టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వారు అక్కడకు వెళితే అభిమానులు వస్తారని, తద్వారా సామాజిక భౌతికదూరం మాయమై, కరోనా వ్యాప్తికి కారణమవుతామని భావించారు. అందుకే తమతమ ఇళ్లలోనే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ తాత సేవలను స్మరించుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
ముఖ్యంగా, సీనియర్ ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విటర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు. 'మీరు లేని లోటు తీరనిది' అని ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..

వామ్మో... రెస్టారెంట్లోకి దూసుకు వచ్చిన చిరుతపులి (video)

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?

జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments