Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఓ వీధికి గానగంధర్వుడి పేరు : సీఎం స్టాలిన్ ఆదేశాలు

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (13:13 IST)
గానగంధర్వుడు దివంగత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంచి చెన్నై మహానగరంలోని ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్థంతి వేడుకలు సెప్టెంబరు 25తేదీ బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఎస్పీబీ జీవించివున్న సమయంలో స్థానిక నుంగంబాక్కంలోని కామ్‌ధర్ నగర్‌లో ఉండేవారు. 
 
తన తండ్రి స్మారకార్థం ఎస్బీబీ ఇల్లు ఉన్న వీధి పేరుకు ఎస్పీబీ నగర్ లేదా ఎస్పీబీ వీధిగా నామకరణం చేయాలంటూ ఆయన తనయుడు ఎస్పీబీ చరణ్ ఇటీవల సీఎం కార్యాలయానికి ఓ వినతిపత్రం సమర్పించారు. దీన్ని పరిశీలించిన సీఎం స్టాలిన్ గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఎస్పీబీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠా తదితర భాషల్లో వేలాది పాటలు పాడిన విషయం తెల్సిందే. గత 2020లో ఆయన కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ఎస్పీబీకి కేంద్రం 2001లో0 పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2021లో మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments