Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Video)

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (14:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు.
 
తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై, చూలైయిమేడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 
 
కాగా, ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ వైరస్ కోరల్లో చిక్కగా, ఆ తర్వాత ప్రముఖ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, ఆ తర్వాత మరో డైరెక్టర్ తేజ, పాప్ సింగర్ స్మిత, ఇపుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంలు ఈ వైరస్ బారినపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments