Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Video)

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (14:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు.
 
తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై, చూలైయిమేడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 
 
కాగా, ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ వైరస్ కోరల్లో చిక్కగా, ఆ తర్వాత ప్రముఖ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, ఆ తర్వాత మరో డైరెక్టర్ తేజ, పాప్ సింగర్ స్మిత, ఇపుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంలు ఈ వైరస్ బారినపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments