Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Video)

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (14:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు.
 
తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై, చూలైయిమేడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 
 
కాగా, ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ వైరస్ కోరల్లో చిక్కగా, ఆ తర్వాత ప్రముఖ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, ఆ తర్వాత మరో డైరెక్టర్ తేజ, పాప్ సింగర్ స్మిత, ఇపుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంలు ఈ వైరస్ బారినపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments