అన్నా డ్రగ్స్‌ ఇంతవరకు చూడలేదు.. ఫ్యామిలీతో కలిసి పబ్‌కు వెళ్లా : రాహుల్

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (07:47 IST)
హైదరాబాద్‌ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై జూబ్లీ హిల్స్ పోలీసుల దాడులు సందర్భంగా తన అరెస్టుపై టాలీవుడ్ గాయకుడు, తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనివారం రాత్రి రాత్రి 11:30 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి పబ్‌కు వెళ్లినట్టు చెప్పారు. పోలీసులు అర్థరాత్రి 1:45 నుండి 2 గంటల సమయంలో దాడులు నిర్వహించారని తెలిపారు. 
 
డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ఇప్పటికే అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. కిక్కిరిసిపోవడంతో నిర్ణీత సమయానికి మించి పబ్ నుంచి బయటకు రాలేకపోయానని చెప్పారు. తన ఫ్రెండ్ పార్టీ చేసుకుంటుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ పబ్‌కు వెళ్లినట్టు చెప్పారు. 
 
అక్కడ నేను డ్రగ్స్ తీసుకున్నాననడం అవాస్తమన్నారు. కావాలంటే డీఎన్ఏ పరీక్షలకు తన శాంపిల్స్ ఇస్తానని ప్రకటించారు. అన్నా.. డ్రగ్స్ ఎలా ఉంటాయో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పారు. నేను పబ్ నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆపారని, వాళ్లు ఎందుకు ఆపారో ఆ సమయంలో తనకు తెలియదని చెప్పారు. అయితే, పబ్‌లో మాత్రం 200 మంది వరకు ఉన్నారని చెప్పారు. దీంతో లోపలి నుంచి బయటకు రావడానికే 20 నిమిషాల సమయం పట్టిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments