అన్నా డ్రగ్స్‌ ఇంతవరకు చూడలేదు.. ఫ్యామిలీతో కలిసి పబ్‌కు వెళ్లా : రాహుల్

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (07:47 IST)
హైదరాబాద్‌ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై జూబ్లీ హిల్స్ పోలీసుల దాడులు సందర్భంగా తన అరెస్టుపై టాలీవుడ్ గాయకుడు, తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనివారం రాత్రి రాత్రి 11:30 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి పబ్‌కు వెళ్లినట్టు చెప్పారు. పోలీసులు అర్థరాత్రి 1:45 నుండి 2 గంటల సమయంలో దాడులు నిర్వహించారని తెలిపారు. 
 
డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ఇప్పటికే అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. కిక్కిరిసిపోవడంతో నిర్ణీత సమయానికి మించి పబ్ నుంచి బయటకు రాలేకపోయానని చెప్పారు. తన ఫ్రెండ్ పార్టీ చేసుకుంటుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ పబ్‌కు వెళ్లినట్టు చెప్పారు. 
 
అక్కడ నేను డ్రగ్స్ తీసుకున్నాననడం అవాస్తమన్నారు. కావాలంటే డీఎన్ఏ పరీక్షలకు తన శాంపిల్స్ ఇస్తానని ప్రకటించారు. అన్నా.. డ్రగ్స్ ఎలా ఉంటాయో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పారు. నేను పబ్ నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆపారని, వాళ్లు ఎందుకు ఆపారో ఆ సమయంలో తనకు తెలియదని చెప్పారు. అయితే, పబ్‌లో మాత్రం 200 మంది వరకు ఉన్నారని చెప్పారు. దీంతో లోపలి నుంచి బయటకు రావడానికే 20 నిమిషాల సమయం పట్టిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments