Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపరీతంగా విస్కీ తాగడం వల్ల ఆరోగ్యం పాడైంది : శృతిహాసన్

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:50 IST)
విపరీతంగా విస్కీ సేవించడం వల్ల తన ఆరోగ్యం పాడైనట్టు విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
తాను ఒకానొక సమయంలో విస్కీకి బానిసనయ్యానని చెప్పింది. రెండేళ్ల పాటు వివరీతంగా మందు తాగానని దాంతో, తన ఆరోగ్యం పాడయిందని వాపోయింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వెల్లడించింది. 
 
కాగా, తెలుగు, తమిళ భాషల్లోనేకాకుండా బాలీవుడ్‌లో సైతం మంచి గుర్తింపు పొందిన శృతిహాసన్... శృతి సినీ జీవితం గురించే కాకుండా... ఆమె ప్రైవేట్ లైఫ్ కూడా ఎక్కువగా పతాక శీర్షికల్లోకి ఎక్కింది. మైఖేల్ అనే విదేశీయుడి ప్రేమలో మునిగి తేలింది. 
 
వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతన్ని పెళ్లాడబోతున్నానని ప్రకటించిన శృతి... ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రేమాయణానికి ముగింపు పలికింది. 
 
శృతిహాసన్ టాలీవుడ్‌లో చివరిసారిగా పవన్ కల్యాణ్ సరసన 'కాటమరాయుడు' చిత్రంలో శృతి నటించింది. ఇప్పుడు రవితేజ సినిమాతో మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments