Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

ఠాగూర్
ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (19:49 IST)
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. గత ఫిబ్రవరి 13వ తేదీన నుంచి తన ఎక్స్‌ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అయితే, తాజాగా ఇపుడు తన ఎక్స్‌ ఖాతా రికవరీ అయిందని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపింది. 'ఇన్ని రోజులూ నా ఖాతా హ్యాక్ అయ్యింది. నా ఖాతాలో ఇప్పటివరకు బెట్టింగ్ యాడ్స్, స్పామ్ యాడ్స్‌లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని రిపోర్టు చేయాలని ఆమె కోరారు. 
 
యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ! 
 
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియా... 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. గత 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే చిత్రంతో ఆమె నటిగా అడుగుపెట్టి వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రను పోషించిన "ఓదెల-2" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన 20 యేళ్ళ సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
నిజ జీవితంలో తాను కాలేజీ విద్యను అభ్యసించకపోయినప్పటికీ సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానని తెలిపారు. పరిశ్రమలో 20 యేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేరీర్ ప్రారంభించినపుడు ఇన్నేళ్లు కొనసాగుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే, తన 21వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. 
 
ఆ రోజు షుటింగ్ నుంచి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా, ఒక తమిళ పత్రికలో తనను నెంబర్ 1 హీరోయిన్‌గా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందన్నారు. అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ స్థాయికి త్వరగా చేరుకుంటానని తాను ఎపుడూ అనుకోలేదన్నారు. నంబర్ 1 స్థానానికి చేరుకున్న తర్వాత ఆ స్థానంలో కొనసాగడం అంత సులువుకాదని ఆమె చెప్పుకొచ్చారు. అది ఒక బాధ్యతగా భావించి ప్రేక్షకులను ఆలరించే విధంగా సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఈ స్థాయికి చేరుకున్నానని తమన్నా వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments