''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:18 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా మార్చి 29న విడుదల కావాల్సి వుండగా, హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 
 
ఈ చిత్రాన్ని 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించడం కనిపించడంతో.. ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎన్నికలయ్యాకైనా ఈ సినిమాను విడుదల చేయాలని వర్మ హైకోర్టును కోరుతారో లేకుంటే ఎన్నికల ఫలితాల వరకు ఈ చిత్రాన్ని ఆపేసేందుకు టీడీపీ నేతలు పట్టబుడుతారో తెలియాలంటే.. వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments