Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:18 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా మార్చి 29న విడుదల కావాల్సి వుండగా, హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 
 
ఈ చిత్రాన్ని 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించడం కనిపించడంతో.. ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎన్నికలయ్యాకైనా ఈ సినిమాను విడుదల చేయాలని వర్మ హైకోర్టును కోరుతారో లేకుంటే ఎన్నికల ఫలితాల వరకు ఈ చిత్రాన్ని ఆపేసేందుకు టీడీపీ నేతలు పట్టబుడుతారో తెలియాలంటే.. వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments