Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` షాడో రిలీజైంది

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (13:06 IST)
Evaru melo koteeswarlu shadow
`మా` టీవీలో `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు` అనే ప్రోగ్రామ్ తెలిసిందే. నాగార్జున దానికి హోస్ట్‌గా వున్నాడు. ఇప్పుడు ఇటువంటి రియాల్టీ షోను జెమినీ టీవీ భుజాన వేసుకుంది. కానీ పేరుగా కొద్దిగా అటూఇటూ మార్చింది. అదే `ఎవరు మీలో కోటీశ్వరులు`. దీనిలో ఎన్‌.టి.ఆర్‌. హోస్ట్‌గా వ‌స్తున్న‌ట్లు ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆదివారంనాడు ఏకంగా ఆయ‌న కుర్చీలో కూర్చున్న షాడో రూపంలో లోగో విడుద‌ల చేసింది. సినిమాలు చేస్తూ ఒక్క‌సారిగా బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు.
 
 ఇదిలా వుండ‌గా, ఒక్కోటి ఈ షోకు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ప‌లు ప్రోమోస్ షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్రివిక్ర‌మ్ వీటిని డైరెక్ట్ చేశారు. ఇప్ప‌టికే దీనిపై హోంవ‌ర్క్ చేశారు. అయితే గ‌తంలో చేసిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుల‌కు భిన్న‌మైన రీతిలో వినూత్నంగా జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలిసింది. ఈ ఎపిసోడ్‌కు సూమారు కోటికి పైగా పారితోషికాన్ని తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ రియాల్టీ షో 2020లోనే ఆరంభం కావాల్సింది. కానీ కోవిడ్ వ‌ల్ల ఈ ఏడాదికి షురూ కానుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments