ఆర్జీవీ దర్శకత్వంలో "శశికళ" బయోపిక్

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:29 IST)
తాను నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా గత నెల 29వ తేదీన విడుదలై దుమ్మురేపుతోంది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం నిర్మాణ ఖర్చులన్నీ రాబట్టుకోగా, ఇపుడు లాభాల వర్షం కురిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశారు. గతంలో శశికళపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఆ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. 
 
తమిళనాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా పేరును 'శశికళ' అని వర్మ ప్రకటించాడు. శశికళకు జైలు శిక్ష, మన్నార్‌గుడి మాఫియాలను హైలెట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. 
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆదివారం ఈ చిత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. కాగా, ఆర్జీవీ చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విజయంతో ఇటు ఆర్జీవీతో పాటు అటు ఆయన అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments