Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిలేరు నీకెవ్వరు నుంచి టైటిల్ ట్రాక్ వచ్చేసింది..

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (17:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు వచ్చేశాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు తన ఎంటైర్ కెరీర్‌లో తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నారు. 
 
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలానే టాలీవుడ్ లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన విజయశాంతి ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్‌కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. 
 
తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ ట్రాక్‌ని కాసేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆర్మీ జవానుల గొప్పతనాన్ని, త్యాగ నిరతిని చాటిచెప్పే విధంగా ఎంతో అత్యద్భుతంగా పాట సాగిందని పలువురు శ్రోతలు ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్‌కు రామ జోగయ్య శాస్త్రి హృద్యమైన సాహిత్యాన్ని అందించగా, దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మంచి ట్యూన్ ని అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.
 
ఇక జనవరి 5న ఎంతో వైభవంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకకు ఇప్పటికే చాలావరకు ఏర్పాట్లు మంచి జోష్‌తో జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments