Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SarangaDariya​​ పాటకు చిక్కు.. సాయిపల్లివి తలనొప్పి..(Video)

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (11:48 IST)
సాయిపల్లవి పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టిస్తున్నాయి. వచ్చిండే, రౌడీ బేబీ పాటలు ఇప్పటికే ట్రెండ్ సెట్ చేశాయి. ఈ కోవలోనే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట గత వారం రోజులుగా యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ జానపద గేయానికి జై కొడుతున్నారు. అయితే ఈ పాటపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.
 
సాధారణంగా జానపద గేయాలు సినిమాలో తీసుకున్నప్పుడు ఒరిజినల్ సింగర్ నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్లకు క్రెడిట్స్‌ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. ఇప్పుడు 'సారంగ దరియా..' పాటపై కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి అనే జానపద గాయని. సారంగదరియా పాట అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానని.. ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్‌ తన సొంతమని చెప్తుంది ఈమె.
 
అప్పట్లో స్టార్ మాలో వచ్చిన రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్‌ తేజ తన పాట విన్నాడని.. ఇప్పుడు లవ్‌ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్‌ తేజకు ఫోన్‌ చేశానని చెప్పింది కోమలి. ఇది ఎవరి సొంతం కాదు.. నువ్వు పుట్టక ముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడని చెప్పుకొచ్చింది. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదని తెలిపింది. 
 
సినిమాలో ఈ పాట తనతో పాడించనందుకు బాధేసిందని.. తన బాధను చూసి నెక్స్ట్‌ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్‌ కమ్ముల హామీ ఇచ్చారని చెప్పింది కోమలి. కానీ ఈ పాట విషయంలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఇవ్వాల్సిన పేరు ఇవ్వలేదని కోమలి మీడియా ముందు చెప్పింది. మరి ఈ వివాదానికి సాఫ్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments