కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్, ఏంట‌ది?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (22:04 IST)
కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.
 
సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.
 
స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే… హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)

Woman: ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్

NEET UG-2026: నీట్‌ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్

భార్యపై అనుమానం.. గొడ్డలితో భార్య కాలిని నరికిన భర్త...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

తర్వాతి కథనం
Show comments