Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైటిల్ గెలిచావ్‌గా.. ఇకనైనా కంట్రోల్‌లో ఉండమను..

బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించినది కౌశల్ ఆర్మీ అనేది జగమెరిగిన సత్యం. అభిమానులంతా కలిసి ఒక ఆర్మీగా ఏర్పడి, ప్రచారాలు చేయడం, 2కె రన్‌లు నిర్వహించడం వంటివి చేసారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (14:18 IST)
బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించినది కౌశల్ ఆర్మీ అనేది జగమెరిగిన సత్యం. అభిమానులంతా కలిసి ఒక ఆర్మీగా ఏర్పడి, ప్రచారాలు చేయడం, 2కె రన్‌లు నిర్వహించడం వంటివి చేసారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మిగతా వ్యక్తులను కించపరిచేలా ట్రోలింగ్ చేయడం, ఆడవారిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం, వారి వ్యక్తిగత విషయాలను బయటికి లాగి నానా రభస చేయడం మాత్రం సరికాదంటూ బిగ్ బాస్ టు సీజన్ మొదటి ఫైనలిస్ట్ అసంతృప్తి వ్యక్తపరిచారు. ఇలాంటి పనుల వలన అందరూ చాలా బాధపడుతున్నారని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
 
పర్సనల్ లైఫ్ గురించి ట్రోల్ చేస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. కనీసం మగవాళ్లైనా ఒక పరిధి వరకు లైట్ తీసుకోగలరు, కానీ ఆడవాళ్లు అలా తీసుకోలేరు. ఒక వ్యక్తి మీద అభిమానం చూపించుకోవడానికి మిగతా వ్యక్తులను కావాలనే వారి పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి పూర్తిగా తెలియకుండానే డీఫేమ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదని సామ్రాట్ అభిప్రాయపడ్డారు. 
 
హౌస్‌లో అందరి మధ్య గేమ్ చాలా స్పోర్టివ్‌గా జరిగింది. బయట జరుగుతున్న విషయాలు బయటకు వచ్చాకే తెలిసాయి. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వారి ప్రొఫెషన్‌కు ఇబ్బంది కలిగేలా ట్రోల్ చేయడం బాధాకరం. నాపైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. చివరికి నాని అన్న సినిమాను బహిష్కరించే స్థాయిలో ఇదంతా జరిగిందంటే నమ్మశక్యంగా లేదు.
 
కౌశల్ 20 ఏళ్లుగా పరిశ్రమలో ఎదగడానికి కష్టపడుతున్నారు, అలాగే నేను కూడా 11 ఏళ్లుగా కష్టపడుతున్నాను. నీ అభిమానులను చూసి ఆశ్చర్యపోయాను. చాలా ఆనందంగా ఉంది. కానీ అభిమానం పేరుతో నీతో పాటు ఇన్నిరోజులు ఉన్న నీ హౌస్‌మేట్స్‌ను కించపరుస్తున్నారు. గేమ్ ముగిసింది. టైటిల్ నీకు స్వంతమైనందుకు ఆనందంగా ఉంది. ఇక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ ట్రోల్స్ చేస్తున్నవారిని ఆపించు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అని కౌశల్‌ను సామ్రాట్ రిక్వెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును రాజకీయం చేయొద్దు.. చంద్రబాబు వార్నింగ్

Etala: నా ఫోన్‌ను బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసింది.. ఈటెల రాజేందర్ ఫైర్

తెలంగాణ వాసి రాకేష్ ఆర్నెకి మిస్టర్ ఇండియా 2025 టైటిల్

టూరిస్ట్ సైట్స్ చూపిస్తానని నమ్మించి.. ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం..

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments