Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌ నుంచి కబురందుకున్నారట హీరోయిన్‌ సమంత

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (11:33 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు సమంత.
 
ఈ నేపథ్యంలో సమంత ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి కబురు అందుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో 'కింగ్‌ ఆఫ్‌ కోథా' అనే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కనుంది.
 
ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు చిత్రయూనిట్‌ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ యాడ్‌లో దుల్కర్, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌తో సినిమా వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు.
 
అయితే బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments