Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌ నుంచి కబురందుకున్నారట హీరోయిన్‌ సమంత

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (11:33 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు సమంత.
 
ఈ నేపథ్యంలో సమంత ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి కబురు అందుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో 'కింగ్‌ ఆఫ్‌ కోథా' అనే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కనుంది.
 
ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు చిత్రయూనిట్‌ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ యాడ్‌లో దుల్కర్, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌తో సినిమా వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు.
 
అయితే బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments