Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది.. అది ఎప్పటికీ పోదు: చైతూ

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (10:53 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడిపోయిన పది నెలల గడుస్తున్న చై-సామ్‌ విడాకులు వార్తలు నెట్టింట చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
 
విడాకుల ప్రకటన వరకు కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించారు. అలాంటి చై-సామ్‌ విడిపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదట్లో విడాకులపై అసలు నోరు విప్పని చై లాల్‌ సింగ్‌ చద్దా ప్రమోషన్స్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. 
 
విడాకుల గురించి కాకుండా కొత్తగా సమంతపై తన అభిప్రాయం ఏంటని అడిగింది యాంకర్‌. దీనికి చై స్పందిస్తూ.. " సమంత అంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేం విడాకులు ప్రకటన ఇచ్చాం. 
 
ఆ సమయంలో కూడా మాకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్‌ ఉంది. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రారంభంలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను" అని చెప్పుకొచ్చాడు.
 
ఆ తర్వాత మరి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని నిర్వచించడం నేర్చుకున్నారా? అని అడగ్గా... అదే చేస్తున్నాను కాబట్టే ప్రస్తుతం ఇలా ఉన్నానన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments