ఐటమ్ సాంగ్ చేసినందుకు థ్రిల్లింగ్‌గా ఉంది.. ఇది ఓ మ్యాడ్‌నెస్ : సమంత

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:38 IST)
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు కె.సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప". ఈ నెల 17వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. ఈ పాటకు అద్భుతమైన స్పందనతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సమంత ఈ పాటపై స్పందించారు. ఈ పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఇది ఓ మ్యాడ్‌నెస్ అని తెలిపింది. అలాగే, తన ట్విటర్ ఖాతాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ పాటలను కూడా ఆమె షేర్ చేశారు.
 
పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా "ఊ అంటావా.. ఊహూ అంటావా మావా" అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందంటూ ఓ విద్యార్థి అంటున్నట్లు ఆ వీడియోలో వుండటం గమనార్హం. 
 
అంతేకాకుండా, ఈ సినిమాలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక సాంగ్ తనకు ఓ సవాలుగా అనిపించిందని చెప్పారు. ఆ పాటలో అల్లు అర్జున్‌కు సమానంగా స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా అనిపించిందని సమంత వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు ప్రాణాలు

జూలై 2027 గోదావరి పుష్కరాలు.. ముందుగానే పోలవరం పూర్తికి శరవేగంగా పనులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం (video)

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments