Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత క్రేజీ ట్వీట్ ... ఈ సమాజం మగాళ్ళను ఎందుకు ప్రశ్నించదు...(video)

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:23 IST)
హీరో, తన భర్త అక్కినేని నాగ చైతన్య నుంచి తెగదెంపులు చేసుకున్న హీరోయిన్, అక్కినేని ఇంటి కోడలు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మగాళ్ళను ఈ సమాజం ఎందుకు ప్రశ్నించదంటూ ఓ ట్వీట్ చేశారు.
 
నిజానికి సమంత తన వైవాహిక బంధానికి స్వస్తి చెప్పనున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమెను అనేక మంది టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌మాజం మ‌గాళ్లని ఎందుకు ప్ర‌శ్నించ‌దు అనే కామెంట్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.
 
స‌మంత తాజాగా త‌న మ‌న‌సులోని బాధ‌ను బ‌హిర్గ‌తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ఉండే స‌మాజం, మ‌గ‌ళ‌వాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌దు. 
 
అంటే మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టేనా అని గుడ్ మార్నింగ్ చెబుతూ కొటేష‌న్ పెట్టింది. చైతూ నుండి దూర‌మయ్యాక స‌మంత లోలోప‌ల చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం.
 
పెళ్లి తర్వాత వరుస సినిమాలతో అలరించిన సమంత.. ఇటీవలే ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments