Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ సమాజం.. మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు... సమంత

ఈ సమాజం.. మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు... సమంత
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:19 IST)
అక్కినేని నాగ చైతన్య- సమంతల వివాహం విడాకులతో ముగిసింది. ఏడేళ్ల ప్రేమ, మూడేళ్ల వివాహబంధాలకు పుల్ స్టాప్ పెట్టారు ఈ జంట. ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమని, కేవలం స్నేహితులుగానే ఉండాలనుకుంటున్నామని సోషల్‌ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. 
 
అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తుంటే.. మరికొందరూ సమంతను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్ చేసిందనీ, గ్లామరస్‌ ఫోటో షూట్‌లే చేసిందనీ, మరికొందరూ ఓ లైన్ దాటి.. ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌తో ఎఫైర్ ఉందనీ దారుణంగా ట్రోల్ చూస్తూ నిందలేస్తున్నారు.
 
ఇవే విడాకులకు కారణాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొందరూ సమంతకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. కానీ ట్రోల్స్ ఆగడంలేదు. ఈ క్రమంలో సమంత తన మనసులోని బాధను బహిర్గతం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను ప్రశ్నించే ఈ సమాజం.. అదే మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అంటూ కామెంట్ పోస్టు చేసింది. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
 
నాగచైతన్య నుంచి దూరమయ్యాక సమంత చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోసాని-పవన్‌ కాంట్రవర్సీపై నాగబాబు.. నా నోరు పాడుచేసుకోవాలనుకోలేదు..