Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజార్‌-2కి రంగం సిద్ధం.. 12 ఏళ్ల తర్వాత సల్మాన్, శిల్పాశెట్టి

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (16:29 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో.. 12 ఏళ్ల తర్వాత శిల్పాశెట్టి జతకట్టనుంది. ''అజార్''కి సీక్వెల్‌గా తెరకెక్కే సినిమాలో ఈ జంట మళ్లీ స్క్రీన్‌ని పంచుకోనుంది. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, శిల్పా శెట్టి మంచి స్నేహితులు. అంతేకాదు.. వీరిద్దరూ జతకడితే ఆ సినిమా హిట్టే. వీరి కాంబోలోఅజార్‌, గర్వ్‌: ప్రైడ్‌ అండ్‌ హానర్, ఫిర్‌ మిలేంగె, షాదీ కర్కే ఫస్‌ గయా యార్‌ వంటి సినిమాలు సక్సెస్ అయ్యారు. 
 
వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం 'షాదీ కర్కే ఫస్‌ గయా యార్‌' 2006లో విడుదలైంది. ఆపై సినిమాలకు శిల్పాశెట్టి దూరమైంది. తాజాగా మళ్లీ వెండితెరపై మెరవబోతోంది. ఇదే జోడీతో తెరకెక్కిన 'అజార్‌' చిత్రానికి సీక్వెల్‌గా 'అజార్‌ 2'ను తెరకెక్కించేందుకు 'అజార్‌' చిత్ర దర్శకుడు, సల్మాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ సన్నాహాలు చేస్తున్నారట. 
 
ఇద్దరు కాలేజ్‌ స్నేహితుల జర్నీని తెలిపే కథాంశంతో 'అజార్‌' సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత దబాంగ్‌-3లో నటించనున్నారు. 2007 నుంచి శిల్పాశెట్టి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లో మెరిశారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సల్మాన్.. శిల్పాశెట్టితో అజార్-2 చేస్తారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments