Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ బస్టాండ్‌లో ఒంటరిగా సాయిపల్లవి.. ఏమైంది..?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:51 IST)
సహజనటి సాయిపల్లవి వరంగల్లో ప్రత్యక్షమైంది. అదీ కూడా ఒంటరిగా కూర్చుని కనిపించింది. సాధారణ ప్రయాణీకురాలిగా అందరితో కలిసిపోయింది. పది నిమిషాల పాటు బస్టాండ్లో కూర్చునే ఉంది. ఎవరూ ఆమెను గమనించలేదు. అయితే ఆమె మాత్రం పది నిమిషాల పాటు బస్టాండ్లోనే కూర్చుండి పోయింది.
 
అసలు ఎందుకు సాయిపల్లవి వరంగల్ బస్టాండ్లో కూర్చుందో ఆ తరువాత గానీ అక్కడున్న వారికి అర్థం కాలేదు. విరాట పర్వం షూటింగ్‌లో భాగంగా సాయిపల్లవి అక్కడ కూర్చుంది. కెమెరామెన్ కూడా రహస్యంగా విజువల్స్‌ను కెమెరా ద్వారా చిత్రీకరించారు. 
 
అయితే సాయిపల్లవి పైకి లేచి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది గుర్తుపట్టారు. సాయిపల్లవి అంటూ గట్టిగా అరిచారు. ఇంతలో చుట్టూ కూర్చున్న యూనిట్ సభ్యులు అభిమానులు ఆపేశారు. సాయిపల్లవి అక్కడి నుంచి లేచి కారు ఎక్కి వెళ్ళిపోయారు. 
 
తెలంగాణా యాసలో సాయిపల్లవి ఈ సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే ఫిదా సినిమాతో తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సాయిపల్లవి. విరాట పర్వంలో రానా హీరో. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments