Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల‌కు "సాహో" ఎంత క‌లెక్ట్ చేశాడో తెలుసా?

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:02 IST)
'బాహుబలి'తో జాతీయనటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్‌కు 'సాహో' చిత్రంతో ఫ్యాన్స్‌తోపాటు ప్రేక్షకులు ఆయన్ను ఫిదా చేసేశారు. శుక్రవారం నాడు నాలుగు భాషల్లో విడుదలైన 'సాహో' చిత్రానికి మొదటగా డివైడ్‌టాక్‌ వచ్చినా… చిత్రంలోని ప్రభాస్‌ యాక్షన్‌ సీన్స్‌కు ఖుషీ అయిపోయారు. 
 
బాలీవుడ్‌లో సల్మాన్‌, తదితరుల హీరోల కలెక్షన్లు వంద కోట్ల క్లబ్‌లో రావడం మనం చూసిందే. కానీ తెలుగులో ప్రభాస్‌కు దక్కడం మరింత విశేషం. దాంతో ప్రభాస్‌ను ఒక్కసారిగా ఒక్కరోజులోనే వందకోట్ల క్లబ్‌లో 'సాహో' చేర్చింది. రెండు రోజుల్లోనే రూ.205 కోట్లు రావ‌డం విశేషం. ప్ర‌భాస్ కెరియ‌ర్‌లో 'బాహుబ‌లి' త‌ర్వాత అతి పెద్ద క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రం 'సాహో'. 
 
ఇండియాలో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన సాహోకు 'డార్లింగ్' ప్రభాస్‌ ఫాన్స్‌తో పాటు సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ 'సాహో' అంటూ నీరాజనాలు పలుకుతున్నారు. బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ విషయంలో ఇంత వరకు ఎక్కడ డ్రాప్‌ కాకుండా హౌస్‌ ఫుల్‌ వసూలుతో దూసుకుపోతుంది. 
 
ఓవర్సీస్‌‌లో కూడా 'సాహో' ప్రభంజనం కొనసాగుతుంది, తొలి రోజులోనే మిలియన్‌ క్లబ్‌‌లో చేరి మరో సారి ప్రభాస్‌ స్టామినా ఏ రేంజ్‌‌లో ఉందో నిరూపించింది 'సాహో'. ప్రభాస్‌ పేరిట ఉన్న తొలి రోజు కలెక్షన్స్‌ రికార్డ్స్‌‌ని కూడా 'సాహో' బ్రేక్‌ చేసింది, చాలా ఏరియాలో ఉన్న 'బాహుబలి' తొలి రోజు కలెక్షన్స్‌ రికార్డ్స్‌‌ని 'సాహో'తో చాలా ఈజీగా దాటేశాడు డార్లింగ్‌ ప్రభాస్‌. 

అబ్బురపరుస్తున హై వోల్టాజ్‌ యాక్షన్‌ సీన్స్‌ 
సాహో కోసం డైరెక్టర్‌ సుజీత్‌ రెడీ చేసిన యాక్షన్‌ సీన్స్‌‌కి థియేటర్స్‌‌లో ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ లభిస్తుంది. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌‌పై ఇంత వరకు కనిపించని హై వోల్టాజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు చూసేందుకు టాక్‌‌తో సంబంధం లేకుండా సాహో థియేటర్స్‌‌కి ఫాన్స్‌ క్యూలు కడుతున్నారు, దీంతో ట్రేడ్‌ విషయంలో కూడా సాహో సరికొత్త రికార్డ్స్‌ సెట్‌ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది.
 
నార్త్‌‌లో డార్లింగ్‌ డై హార్డ్‌ ఫాన్స్‌ హుంగామ 
పాన్‌ ఇండియా వైడ్‌ సినిమాగా రిలీజ్‌ ఐనా సాహోకి రిలీజ్‌ ఐనా ప్రతి చోట హౌస్‌‌ఫుల్‌ కలెక్షన్స్‌ దక్కుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాను బాలీవుడ్‌ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పటికే బుక్‌‌మై షో పే టీమ్‌ వంటి టిక్కెటింగ్‌ వెబ్‌‌సైట్స్‌‌లో ఈ సినిమాకు సంబందించిన టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ బుకింగ్‌ రేషియో నార్త్‌‌లో మరి ఎక్కువగా ఉన్నట్లుగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments