Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''సాహో'' నుంచి రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది..

Advertiesment
prabhas
, మంగళవారం, 23 జులై 2019 (10:40 IST)
''సాహో'' సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్రభాస్ నటనలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా, తాజాగా ఓ రొమాంటిక్ పోస్టర్ విడుదల అయ్యింది. 
 
ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోని పలు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమాను ఇంకా ముందే విడుదల చేయాలని భావించినప్పటికీ, గ్రాఫిక్స్ ఆలస్యమైన కారణంగా రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
 
తాజాగా విడుదలైన పోస్టర్‌లో శ్రద్ధ.. ప్రభాస్‌ను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇకపోతే.. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. 
 
భారతీయ తొలి భారీ యాక్షన్‌ చిత్రంగా దీనిని తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు రూ.150 కోట్లతో సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల 30కి వాయిదా పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర్మా‌.. అస‌లు నీకు ఏమైంది..?