Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" ఐటమ సాంగ్‌పై ఆర్ఎంపీల అభ్యంతరం.. పోలీసులకు ఫిర్యాదు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:55 IST)
మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ దర్శకుడు కొరటాలశివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". వచ్చే నెలలో ప్రేకక్షకుల రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చిత్రంలోని పాటలను లిరికల్ ఆడియోల రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలచేసిన లిరికల్ ఆడియో పాటులకు అద్భుతమైన స్పందన వచ్చింది. 
 
ముఖ్యంగా, తాజాగా చిరంజీవి, రెజీనా కెస్సాండ్రా కాంబోలో వచ్చిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. అయితే, ఈ పాటతోనే ఓ కొత్త వివాదం చెలరేగింది. ఈ పాటలోని లిరిక్స్ తమను కించపరిచేలా ఉందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఆర్ఎంపీ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ పాటలోని లిరిక్‌లో "ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే" అనే లైన్ ఉంది. అంటే అందమైన అమ్మాయిలను టచ్ చేయొచ్చనే ఉ్దదేశ్యంతో కుర్రాళ్లు ఆర్ఎంపీ వైద్యులు అయిపోతున్నారనే విధంగా ఆ లిరిక్ అర్థం వుంది. 
 
దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై రాష్ట్రంలోని జనగామకు చెందిన ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాలశివపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments