సుశాంత్ ప్రియురాలి కాల్ డేటాలో 'ఏయు'... ఎవరా ఏయూ??

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:12 IST)
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసును ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. అలాగే, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి కోట్లాది రూపాయలు బదిలీ అయ్యాయన్న ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో సోదరుడు శోవిక్‌, తండ్రి ఇంద్రజిత్‌, మాజీ మేనేజర్‌ శృతి మోడీ, సిద్దార్థ్‌ పితానిని విచారించారు. 
 
ఈ దర్యాప్తులో భాగంగా రియాతోపాటు ఆమె సోదరుడు, తండ్రి ఫోన్లను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ కోసం ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే రియా చక్రవర్తి కాల్‌ రికార్డులో ఓ అనుమానాస్పద పేరును ఈడీ అధికారులు గుర్తించారు.
 
రియా కాల్‌ చేసిన ఓ ఫోన్‌ నంబర్‌ ఏయూ పేరుతో ఉందట. అయితే ఏయూ ఎవరనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీయగా.. అది అన్నయ ఉద్ధస్‌ అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ నంబర్‌ అని, ఆ వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని నిర్దారణకు వచ్చారని తెలుస్తోంది. సుశాంత్‌ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండియన్ స్టూడెంట్స్ పైన ట్రంప్ టార్గెట్?!, ఏం చేసారో తెలుసా?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌‌ను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంది.. చంద్రన్న

Sri Venkateswara University: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు యువతి రీల్స్ (video)

జూబ్లీహిల్స్ ఉప పోరు ఎపుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments