Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దృశ్యం' మూవీ డైరెక్టర్ నిషికాంత్ ఆరోగ్యం విషమం!!

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (08:50 IST)
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ వచ్చారు. ఈ సమస్యలు మరింతగా ముదిరిపోవడంతో హైదరాబాద్ నగరం, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాల సమాచారం. 
 
'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి, అదే సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 
 
మలయాళ సూపర్ హిట్ మూవీ 'దృశ్యం' హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించింది నిషికాంతే. 'ముంబై మేరీ జాన్', 'ఫోర్స్',  'లై భారీ' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మూవీ 'హవా ఆనే దే', మరాఠీ సినిమా 'సాచ్య ఆట ఘరాట్' సినిమాల్లో నటించారు కూడా. బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహాం నటించిన 'రాకీ హ్యాండ్సమ్‌' సినిమాలో విలన్‌ గానూ నటించి మెప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments