Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ పడుద్ది : 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు లైన్ క్లియర్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:00 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన.. ఈసీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019, మార్చి 29వ తేదీ సినిమా విడుదల ఉంటుందని తెలిపారు. మూవీ రిలీజ్ తర్వాత అభ్యంతరాలు ఉంటే.. మళ్లీ వివరణ ఇస్తామన్నారు. జగన్‌తో బంధుత్వం లేదని.. కేవలం పార్టీ అధినేతగా మాత్రమే పరిచయం అని స్పష్టం చేశారాయన. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రాసిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మించడం జరిగిందని ప్రకటించారు. 
 
పోలింగ్‌కు 13 రోజుల ముందు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కావటంపై టీడీపీ నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును విలన్‌గా చూపించారంటూ.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ సినిమా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అభిమానులు. దీంతో నిర్మాత రాకేష్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. 
 
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం లైన్ క్లియర్ కావడంతో మార్చి 29వ తేదీన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments