కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అంతా చీకటిగానే అనిపిస్తుంది.. రేణూ దేశాయ్

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (13:34 IST)
మెగా ఫ్యామిలీ ఇంటి పెళ్లి భజంత్రీలు మోగిన వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అంతా చీకటిగానే అనిపిస్తుదంటూ రేణూ దేశాయ్ కామెంట్స్ చేస్తూ, పేర్లు ప్రస్తావించకుండానే నిహారిక - చైతన్య కొత్త దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, రేణూ దేశాయ్ చేసిన ఓ వీడియో సందేశాన్ని పరిశీలిస్తే, కాబోయే జీవిత భాగస్వామితో రిలేషన్ షిప్ ను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుందని చెప్పుకొచ్చారు. చాలా సార్లు చాలా మంది తమ భర్త మంచిగా లేరని తెలిసి కూడా అతనితో మంచిగా ఉండేందుకే ప్రయత్నిస్తారని చెప్పిన రేణూ దేశాయ్, అది భారతీయ మహిళలకు  అలవాటై పోయిందని వ్యాఖ్యానించారు. 
 
ఏ వివాహమైనా బ్రేకప్ అయిందంటే, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని, దాన్ని కర్మ అని కూడా అనుకోవచ్చని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందడుగు వేయాలని అన్నారు. తాను ఈ అడుగులన్నీ వేసుకుంటూనే వచ్చానని, అందరి ఆశీర్వాదంతో కొత్త జంట జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నానని ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండానే నిహారిక, చైతన్య దంపతులకు తన విషెస్ అందించారు. 
 
కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో చీకటిగా అనిపిస్తుందని, కానీ ఆ చీకటి నుంచి మానసిక దృఢత్వం, స్వయంకృషితోనే బయటకు రావాలని అభిలషించారు. ఎవరో వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దని, వారు సాయం చేసినా, ఎవరికి వారే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి వుండాలని సూచించారు. రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments