Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో కిల్లర్‌గా మారనున్న రాశీఖన్నా... ఎందుకని?

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (11:33 IST)
విభిన్నమైన కథలను ఎంచుకుని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి కథానాయికలకు వెబ్‌ సినిమాలు మంచి వేదికలవుతున్నాయి. సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తాచాటడంతో మరికొంత మంది తారలు వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. 
 
తాజాగా పంజాబీ సుందరి రాశీఖన్నా డిజిటల్‌ వేదికపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ఆమె ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. రాజేష్‌ దర్శకుడు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 
 
ఇందులో రాశీఖన్నా సైకో హంతకురాలిగా కనిపించనుందట. విపరీత మనస్తత్వం కలిగిన యువతిగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని చెబుతున్నారు. రాశీఖన్నా నటిస్తున్న రెండో వెబ్‌సిరీస్‌ ఇది. ‘రుద్ర’ సిరీస్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సిరీస్‌ ఓటీటీ వేదికపై తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments