Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ వివాదాస్ప‌ద ట్వీట్‌.. అందరూ పరాన్న జీవులే !

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:12 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఏదో ట్వీట్‌ చేసి… వార్తల్లో నిలుస్తుంటారు. అయితే… తాజాగా వర్మ మెగా ఫ్యామిలీ‌పై దృష్టిపెట్టారు. అల్లు అర్జున్‌ ఒక్కడే రియల్‌ మెగాస్టార్‌ అని.. పవన్‌ కళ్యాణ్‌ - రామ్‌ చరణ్‌ సహా ఇతర మెగా హీరోలందరూ పరాన్న జీవులేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఆదివారం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరోలంతా సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్నారు. కానీ, పుష్ప షూటింగ్‌లో ఉన్న బన్నీ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
'శ్రీ మెగా చిరంజీవి మెగా సక్సెస్‌ వల్ల నిలబడిన వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, నిహారిక వంటి తక్కువ స్థాయి పరాన్న జీవులతో పోలిస్తే.. ఈ రోజు అల్లు అర్జున్‌ ఒక్కడే నిజమైన మెగాస్టార్‌. నేను వారిని పరాన్న జీవులు అని ఎందుకు పిలుస్తున్నానంటే వారందరూ చిరంజీవి ద్వారా మాత్రమే మనుగడ సాగిస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఎవరి మీద ఆధారపడలేదు.. కాబట్టి అతను మాత్రమే నిజమైన మెగాస్టార్‌' అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌ పెద్ద దుమారం రేపుతోంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments