Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డిని సింహంతో.. మిగిలిన నేతలను పులులతో పోల్చిన వర్మ!

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (19:12 IST)
సంచలనాత్మక దర్శకుడు వివాదాలకు ఎప్పుడూ కేరాఫ్ ఎడ్రెస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి మరొక పొలిటికల్ పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేసారు. తాజాగా తెలంగాణాలో కాంగ్రెస్ పీసీసీ అద్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డిని సింహంతో పోలుస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసారు. అయితే రేవంత్ రెడ్డిని సింహతో పోల్చిన వర్మ మిగతా నాయకులను పులులతో పోల్చారాయన.
 
ఇక సింహం ట్రాక్‌లోకి వచ్చింది ఇక పులులుతనకు సైడ్ ఇవ్వాల్సిందేనంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు వర్మ. ఇప్పటికే టీపీసీసీ పదవి దక్కలేదని అసహనంతో ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. తాజాగా రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఒక విధంగా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసారు.
 
నాకు రేవంత్ రెడ్డి ఇష్టమున్నా లేకున్నా పార్టీ అధిష్టానం ఇలా చెస్తుందని అనుకోలేదంటూనే ఏదేమైనా పార్టీ నిర్ణయం ఫైనల్ కాబట్టి తాను రేవంత్ రెడ్డితో కలిసి పనిచెయ్యాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం పీసీసీ అద్యక్ష పదవి దక్కలేదని అసహనంతో ఉన్న నాయకులను రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లతో మరింత అసహనానికి గురిచేసినట్లయింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments