Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - అఖిల్ మధ్య వార్.. నువ్వా నేనా తేల్చుకుందామంటున్న హీరోలు...

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:00 IST)
మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్, అక్కినేని కుటుంబ కథానాయకుడు అఖిల్‌ల మధ్య వెండితెర ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. ఆ వార్ నువ్వా నేనా తేల్చుకుందామన్న స్థాయికి చేరుకుంది. ఇతకీ మంచి స్నేహితులైన ఈ ఇద్దరు హీరోల మధ్య ఎందుకు వివాదం చెలరేగిందో ఓ సారి తెలుసుకుందాం. 
 
అఖిల్ అక్కినేని తన మూడో చిత్రం "మిస్టర్ మజ్ను"తో బిజీగా ఉన్నాడు. తన రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రాన్ని అఖిల్ ఓ సవాల్‌గా తీసుకుని రేయింబవుళ్లూ కష్టపడుతున్నాడు. 'తొలి ప్రేమ' వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతుంది. "మిస్ట‌ర్ మ‌జ్ను" అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అభిమానుల‌ని అల‌రించేలా ఉంటుంద‌ని అంటున్నారు. దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అఖిల్ కొత్తగా క‌నిపిస్తుండగా, ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. 
 
ఇకపోతే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. దీంతో చెర్రీ - అఖిల్‌ల మధ్య వెండితెర వార్ నెలకొంది. ఈ ఇద్దరు కుర్ర హీరోలు తమతమ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. ఫలితంగా ఈ ఇద్దరి హీరోల మధ్య వెండితెర పోటీ నెలకొంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments