Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిస్ట‌ర్ మ‌జ్ను ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

మిస్ట‌ర్ మ‌జ్ను ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?
, బుధవారం, 31 అక్టోబరు 2018 (17:05 IST)
అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ మూవీ టీజ‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. రిలీజ్ చేయ‌డం లేదు.
 
కార‌ణం ఏంటంటే.. డిసెంబ‌ర్ నెలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండ‌టంతో డిసెంబ‌ర్‌లో కాకుండా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. రెండు పాటలు.. రెండు ఫైట్లు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వ‌ర‌లోనే మిగిలి ఉన్న రెండు పాట‌లు, రెండు ఫైట్ల‌ను కంప్లీట్ చేయ‌నున్నాం. అతి త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌చేసింది. ఈ మూవీపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌తో సినిమా ఖాయం.. అడ్వాన్స్ తిరిగి తీసుకోలేదు: మైత్రీ మూవీ మేకర్స్