త్వరలోనే 'ఓబులమ్మ'గా మీ ముందుకు వస్తానంటున్న రకుల్

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (17:09 IST)
కరోనా వైరస్ బారినపడిన సినీ సెలెబ్రిటీల్లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కరోనా వైరస్ బారినపడిన ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 
 
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. కొవిడ్ నుంచి బయటపడటానికి తాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తన గదిలోంచి అస్సలు బయటకు రావడం లేదన్నారు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ చక్కటి పౌష్టికాహారం తీసుకుంటున్నట్టు చెప్పారు.
 
అంతేకాకుండా, విటమిన్‌ మాత్రలు వేసుకుంటున్నానని, అభిమానుల ప్రేమాభిమానాలు, ప్రార్థనలతో త్వరలోనే కరోనాను అధిగమించి అందరి ముందుకు వస్తాననే విశ్వాసం ఉందని వీడియాలో చెప్పింది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 
 
కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో నటించింది. చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇందులో ఆమె రాయలసీమకు చెందిన పల్లెటూరి యువతి 'ఓబులమ్మ' పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో పాటు నితిన్‌ 'చెక్' మూవీలో రకుల్‌.. న్యాయవాది పాత్ర పోషిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments