Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ వస్తున్నారంటున్న సోదరుడు, ఎక్కడికి?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (19:07 IST)
తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వంపై జనం విసిగిపోయారని, ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఎవ్వరికీ లేదంటూ ప్రముఖ సినీనటుడు, తమిళ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చెబుతూ వచ్చారు. ఆయన స్వయంగా ఒక పార్టీ పెట్టినా జనంలోకి పూర్తిస్థాయిలో వెళ్లలేకపోయారు.
 
అయితే సినిమాల్లోను నిజజీవితంలోను తాను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్న రజినీకాంత్‌తో కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని కమల్ హాసన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రజినీకాంత్ కూడా గత కొన్నిరోజుల ముందు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీ ప్రకటించారు. కమల్ లాంటి వ్యక్తులు తనతో పాటు కలిసి నడవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
 
ఇదిలా ఉండగానే నేడు రజినీకాంత్ 70వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రజినీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజినీ సోదరుడు సత్యనారాయణరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీ అనుకున్న విధంగానే రాజకీయాల్లోకి వస్తున్నారు. వచ్చే నూతన యేడాది రాజకీయ పార్టీ పేరు, విధివిధానాలను రజినీకాంత్ ప్రకటిస్తారని సత్యనారాయణరావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments