దేవుని పటాలపై రాజమౌళి, మహేష్ బాబు సినిమా పూజతో ప్రారంభం

డీవీ
గురువారం, 2 జనవరి 2025 (16:31 IST)
Rajamouli and Mahesh Babu
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం  కొత్త సంవత్సర సందర్భంగా గురువారంనాడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాదాపూర్ దగ్గరలో వున్న అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో దేవుని పటాలపై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు.
 
ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ హాజరయ్యారు. దేవునిపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టగా, ఎస్.ఎస్. రాజమౌళి కెమేరా స్విచ్చాన్ చేశారు. నేడు లాంభచనంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించిన మహేష్ బాబు 29 చిత్రం వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
దుర్గా ఆర్ట్స్ బేనర్ పై పలు చిత్రాలు నిర్మించి చాలాకాలం గేప్ తీసుకున్న కె.ఎల్. నారాయణ ఈ సినిమాలో భారీ నిర్మాతగా మారుతున్నారు. ఎస్. గోపాల్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. బహుశా రాజమౌళి చీఫ్ గెస్ట్ గా సాయంత్రం గేమ్ ఛేంజర్ లో ఈవెంట్ లో పాల్గొంటున్నారు. అక్కడ మహేష్ బాబు సినిమా గురించి తెలియజేస్తారని అభిమానులు   భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments