Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి టీమ్‌కి షాక్ ఇచ్చిన వంశీ..!

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే  నటిస్తుంటే...అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు అలాగే ఒక వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే. కొంత మంది ఆకతాయిలు, అత్యుత్సాహం ఉన్నవారు ఇలా ఫోటోలు షూటింగ్ వీడియోలు అలాగే ఎడిటింగ్ సమయంలో సినిమా క్లిప్స్‌ని లీక్ చేసిన సందర్భాలు మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నాయి. కానీ ఈ లీకుల బెడద మాత్రం పోవ‌డం లేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించి ఏదోటి లీక‌వుతుండ‌డంతో ఈ సినిమా విషయంలో వంశీ ఇక నుంచి కాస్త పగడ్బందీగా వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అది ఏంటంటే... ఈ సినిమాకి పని చేసే ఏ ఒక్కరి దగ్గర ఆ సినిమా షూటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉండకూడదు అని ఆంక్షలు విధించినట్టు తెలిసింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందే ఏ ఒక్కరు లొకేషన్ కి మొబైల్స్ తీసుకురాకూడదని ప్రతీ ఒక్కరికి స్ట్రిక్ రూల్స్ పెట్టి వంశీ షాకిచ్చాడ‌ట‌. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments