Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా

Advertiesment
Supreme Court
, మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:37 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ఆన్‌లైన్ టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. ఆన్‌లైన్‌ విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది. అదేసమయంలో దేశంలో బాణాసంచా విక్రయాలపై పూర్తి స్థాయి నిషేధం విధించలేమని తేల్చిచెప్పింది. కానీ పటాకుల విక్రయాలపై కొన్ని షరతులను మాత్రం పాటించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
 
కాలుష్యం కోరల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇందులోభాగంగా, టాపాకాయల విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 28వ తేదీన విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచుంది. ఆ తీర్పు మంగళవారం వెలువరించింది. 
 
ఈ కామర్స్ పోర్టల్స్ ఏవీకూడా ఆన్‌లైన్‌లో పటాకులను అమ్మరాదు అని కోర్టు తీర్పునిచ్చింది. దీపావ‌ళి రోజున రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ప‌టాకులు కాల్చాల‌ని, ఇక క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్‌ రోజుల్లో మాత్రం రాత్రి 11.45 నిమిషాల నుంచి అర్థ‌రాత్రి 12.45 వ‌ర‌కు ప‌టాకుల‌ను కాల్చుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

55 కిలోమీటర్ల పొడవు.. చైనా భారీ బ్రిడ్జ్ ప్రారంభం.. జిన్ పింగ్ ప్రారంభించారు..