Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని.. హిందీ టీవీ ఆర్టిస్ట్ కుమార్తె మృతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (18:27 IST)
పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే ఆ బొమ్మలే పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. అవును.. తాజాగా ఆడుకునే బొమ్మను మింగిన నటుడి కుమార్తె మృతి చెందింది. హిందీ టీవీ ఇండస్ట్రీ నటుడు ప్రతీష్ వోరా కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ప్లాస్టిక్ బొమ్మను మింగింది. 
 
పాప ఏడుస్తుంటే ఆకలి అనుకున్నారు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవడంతో పాటు ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి తీసుకుని పరుగులు తీశారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు.. చిన్నారి గొంతులో ఓ చిన్న బొమ్మ ఇరుక్కుందని. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వెంటనే గొంతులోని బొమ్మను తలగించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
 
ప్రతీష్ రెండేళ్ల కుమార్తె తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు.. కేవలం ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని చనిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హిందీ బుల్లితెర నటులు ప్రతీష్‌ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments