Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని.. హిందీ టీవీ ఆర్టిస్ట్ కుమార్తె మృతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (18:27 IST)
పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే ఆ బొమ్మలే పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. అవును.. తాజాగా ఆడుకునే బొమ్మను మింగిన నటుడి కుమార్తె మృతి చెందింది. హిందీ టీవీ ఇండస్ట్రీ నటుడు ప్రతీష్ వోరా కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ప్లాస్టిక్ బొమ్మను మింగింది. 
 
పాప ఏడుస్తుంటే ఆకలి అనుకున్నారు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవడంతో పాటు ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి తీసుకుని పరుగులు తీశారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు.. చిన్నారి గొంతులో ఓ చిన్న బొమ్మ ఇరుక్కుందని. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వెంటనే గొంతులోని బొమ్మను తలగించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
 
ప్రతీష్ రెండేళ్ల కుమార్తె తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు.. కేవలం ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని చనిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హిందీ బుల్లితెర నటులు ప్రతీష్‌ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments