Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగణమన తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్న పూరిజగన్నాధ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (17:06 IST)
Purijagannadh
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగర్` చిత్రీకరణను పూర్తిచేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
పూరి స్వయంగా ప్రకటించినట్లు  తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ని హోమ్ ప్రొడక్షన్ పూరి కనెక్ట్స్ బ్యానర్లో చేయబోతున్నాడు. `జనగణమన` కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే `జనగణమన` తర్వాత  ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్  చేయనున్నారు పూరి జగన్నాధ్. 
 
ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు ప్రస్తుతానికి వెల్లడించనప్పటికీ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ 
పూరి కనెక్ట్స్ పతాకంపై రూపొందనుంది. ఛార్మి కౌర్తో కలిసి పూరి జగన్నాధ్ ఈ సినిమాలన్నింటినీ నిర్మించనున్నారు.
 
ఈ రెండు ప్రాజెక్ట్ల స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేసిన పూరి జగన్నాధ్ రాబోయే సంవత్సరాల్లో ఆ సినిమాలను రూపొందించనున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments