ఎన్టీఆర్ చాలాకాలం తర్వాత ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు.. నాగవంశీ

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (15:04 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఎమోషనల్, మాస్ కంటెంట్‌తో ప్రేక్షకు ముందుకు వస్తున్నారని ఆ చిత్రం నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "మా వైపు నుండి, మా ప్రియమైన ప్రభుత్వం సహాయంతో, చాలాకాలం తర్వాత ఏపీలో బెనిఫిట్ షోలతో పాటు సినిమాను విస్తృతంగా విడుదల చేయడానికి మేము చేయగలిగినదంతా చేసాం. అభిమానులు కూడా ప్రశాంతంగా ఎలాంటి ఫ్యాన్ వార్స్‌కు పాల్పడకుండా ఉండాలి.‌ ఫ్యాన్ వార్స్ తాత్కాలిక కిక్ ఇవ్వవచ్చు. కానీ తర్వాత అది మన హీరోల చిత్రాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. అందువల్ల మా సహ అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఈ అభిమానుల యుద్ధాలను ఆపివేసి, ఈ ఆనందాన్ని ఆస్వాదిద్దాం.
 
మన సినిమాలపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయవద్దని ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాదు, ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మానేయండి. మీ పక్కన కూర్చున్న వారిని కూడా వీడియోలు తీయనివ్వవద్దు. ఆ తర్వాత సినిమా చూస్తున్న  అభిమానులకు కూడా సినిమాను చూసి థ్రిల్ కలుగుతుంది. ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తారక్ అన్నకు మరపురాని బ్లాక్‌బస్టర్‌ని అందిద్దాం. 'దేవర' సెప్పిండు అంటే సేసినట్టే" అని నాగవంశీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments