Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి సర్... గుడ్లు తినండి.. విశ్రాంతి తీసుకోండి.. హాయిగా నిద్రపోండి (video)

Webdunia
గురువారం, 30 జులై 2020 (13:55 IST)
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. పైగా, ఈ వార్త విన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలనే సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హ్యాపీగా ఉండండి సర్. ఏమీ కాదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. విశ్రాంతి తీసుకోండి. హాయిగా నిద్రపోండి' అని సూచించారు. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ సూచనలు చేశారు.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అలా రాజమౌళి కూడా కరోనా వైరస్‌కు చిక్కారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని చెప్పారు. 
 
జ్వరం తగ్గిపోయిందని... అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని... తమకు స్వల్ప స్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. 
 
ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీబాడీలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని... ఆ తర్వాత ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments