Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కష్టంతో పైకివచ్చారు.. మీ పరామర్శ కొండంత బలాన్నిచ్చింది : బండ్ల గణేష్

Advertiesment
కష్టంతో పైకివచ్చారు.. మీ పరామర్శ కొండంత బలాన్నిచ్చింది : బండ్ల గణేష్
, మంగళవారం, 21 జులై 2020 (10:42 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో బండ్ల గణేష్‌ ఓ ప్రత్యేకత. ఆయన నిర్మించిన చిత్రాలు చాలా తక్కువే అయినప్పటికీ... టాలీవుడ్‌లోని బడా నిర్మాతల్లో ఒకరుగా నిలిచారు. ఈయనకు మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా, ఆ ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఆయనకు వీరాభిమాని. అలాంటి బండ్ల గణేష్... మరోమారు మెగా ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. 
 
'కష్టంతో పైకి వచ్చిన వాళ్లకి కష్టం తెలిసిన వాళ్లకి, ఏ అండా లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకి మనసు, ప్రేమ, అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్నందుకు మీరే ఉదాహరణ. యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.
 
'ఎలా ఉన్నావు అంటూ మీరు చేసిన పరామర్శ మాకు కొండంత బలం, తెలియని ఆనందం.. ఎంతో సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు అన్నగారు' అని బండ్ల గణేశ్ తెలిపారు. కాగా, బండ్ల గణేశ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో చిరంజీవి ఫోనులో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
కానీ, తాను అమితంగా ఆరాధించే పవన్ కళ్యాణ్ మాత్రం బండ్ల గణేష్‌ను పరామర్శించలేదు. ఇదే అంశంపై బండ్ల గణేష్ వద్ద ఓ న్యూస్ యాంకర్ ప్రస్తావించగా, బహుశా ఈ విషయం ఆయనకు తెలిసివుండకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వచ్చినా బిగ్ బాస్ ఆగలేదుగా.. ప్రోమో వచ్చేసిందిగా..