పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైనే పూనమ్ కౌర్ పోస్టు పెట్టిందా? వర్మనూ వదిలిపెట్టలేదుగా!

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (15:06 IST)
టాలీవుడ్‌ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అవి కాస్త పెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌లు అయిపోతుంటాయి. తాజాగా ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అయితే..  భీమ్లా నాయక్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభం అయినప్పటి నుంచి.. పూనమ్‌ కౌర్‌ వరుసగా ట్వీట్లు పెడుతోంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లను టార్గెట్‌ చేస్తూ.. వివాద్పద వ్యాఖ్యలు చేసింది పూనమ్‌.
 
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకున్నారు. అలాగే.. చాలా రాజకీయ నాయకులు పెళ్లిళ్ల పై దృష్టి పెట్టారంటూ అర్థం కానీ ట్వీట్‌ చేసింది పూనమ్‌. 
 
అయితే.. ఈ ట్వీట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫైర్‌ అవుతున్నారు. తమ హీరోనే అంటుందని పూనమ్‌ పై మండిపడుతున్నారు. పనిలో పనిగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా పూనమ్ ట్వీట్ చేసింది. 
 
అస‌లు కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌ను పూన‌మ్ కౌర్ ఏమ‌ని కామెంట్ చేసిందంటే?  భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిపైనా విమ‌ర్శ‌లు చేయ‌కుండా చాలా జెంటిల్‌గా మాట్లాడారు. 
 
దీనిపై ఆర్జీవీ ట్విట్ట‌ర్ సాక్షిగా రియాక్ట్ అయ్యారు. తాను చూసిన బెస్ట్ స్పీచెస్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడింది ఒక‌టని తెలియ‌జేస్తూ ఆర్జీవీ ఓ యూ ట్యూబ్ లింకును షేర్ చేశారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది.
 
అయితే ఆ త‌ర్వాత పూన‌మ్ కౌర్ రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. "ఒక ద‌ర్శ‌కుడు ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని కామెంట్ చేస్తారు. సైలెంట్‌గా ఉండిపోతారు. మ‌రో ద‌ర్శ‌కుడు ఆయ‌న్ని రాజ‌కీయంగా నాశ‌నం చేయ‌డానికి సిద్ధంగా ఉంటాడు. ట్విట్ట‌ర్‌లో న‌వ్వుతుంటాడు. ఇద్ద‌రూ డ‌బ్బులిచ్చి బాడుగ‌కు తెచ్చుకోబ‌డిన ఏజెంట్లే. వారు మ‌హిళ‌ల‌ను ఆయుధాలుగా వాడుకుంటారు" అని తెలిపారు. 
 
పూన‌మ్ ఇలా రామ్ గోపాల్ ట్వీట్‌ను షేర్ చేస్తూ కామెంట్ చేయ‌డం ఓ ర‌కంగా చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది. పూన‌మ్ పంచ్ ఇచ్చిన వారిలో ఓ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ అయితే, మ‌రో ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఓ ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments