Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డే సిన్సియారిటీకి చిత్ర యూనిట్ ఫిదా

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (17:54 IST)
టాలీవుడ్‌లో జిగేల్‌రాణిగా చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్ పూజాహెగ్డే. ఈ ముద్దుగుమ్మ అటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో నటించిన పూజా.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో "హౌస్ ఫుల్-4" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో పూజ తన పాత్ర షూటింగ్ పూర్తయ్యేంత వరకు చూపించిన శ్రద్ధకు చిత్ర యూనిట్ ఫిదా అయిపోయింది. 
 
ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరిగింది. షూటింగ్ సమయంలో పూజా హెగ్డే జలుబు, దగ్గు సమస్యలు బాధించాయి. అయితే, పూజా హెగ్డే తన సమస్యను ఏమాత్రం లెక్కచేయకుండా మందులు వాడుతూ షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసింది. 
 
జలుబు, దగ్గు ఉన్నా సినిమా ఆలస్యమవకూడదని భావించి షూటింగ్‌లో పాల్గొంది. దీంతో ఆమె సిన్సియారిటీకి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. కాదా, పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు నటిస్తున్న "మహర్షి" చిత్రంలో నటిస్తోంది. అలాగే, హీరో ప్రభాస్ నటించే 20వ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments