Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను తన్ని తరిమేశానంటున్న పూజా హెగ్డే

Webdunia
గురువారం, 6 మే 2021 (09:47 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. ఈమెకు గత నలె 25వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. తమిళ హీరో విజయ్ కొత్త చిత్రం షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన చిత్ర బృందంలో పూజా హెగ్డే ఒకరు. అక్కడ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఈమెకు కరోనా వైరస్ సోకింది. ఆ వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆమె తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 
 
ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో కరోనాను తన్ని తరిమేశాను. మొత్తానికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ ఆమె ఆమె ట్వీట్‌ చేసింది.
 
మరోవైపు, పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలే ఉన్నాయి. హీరో ప్రభాస్‌తో కలిసి ఆమె ‘రాధేశ్యామ్‌’లో నటించింది. అంతేకాదు.. అక్కినేని అఖిల్‌కు జోడీగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘ఆచార్య’లోనూ ఆమె ఒక కీలకపాత్ర పోషించింది. 
 
తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సరసన మరో నటిస్తోంది. ‘దళపతి 65’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇలా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో ఆమె చాలా బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments