స్టార్ హీరోలతో ఛాన్సులు... డిమాండ్ పేరుతో వసూలు చేస్తున్న పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో జిగేల్‌రాణిగా మంచి గుర్తింపుపొందిన హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగులో అడుగుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. కానీ, బాలీవుడ్‌లో ఈ అమ్మడు పాచికలు పారలేదు. ఈ క్రమంలో తెలుగునే నమ్ముకుంది. అయితే, తెలుగులో ఆమెకి మళ్లీ ఛాన్సులు రావడం .. నిలదొక్కుకోవడం కష్టమేనని అంతా భావించారు. 
 
కానీ, 'అరవింద సమేత', 'మహర్షి', 'గద్దలకొండ గణేశ్' చిత్రాల విజయాలు ఆమె స్థాయిని పెంచుతూ వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఆమె తన పారితోషికాన్ని పెంచుతూ రావడం విశేషం. 
 
'గద్దలకొండ గణేశ్' సినిమా కోసం కోటికిపైగా పారితోషికాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ జోడీగా చేస్తోన్న సినిమా కోసం రూ.2 కోట్లకి పైగా తీసుకుంటోందట. 'అల వైకుంఠపురములో' హిట్ అయితే ఆమె పారితోషికం రూ.3 కోట్లకు చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మొత్తంమీద తెలుగులో రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన పూజాహెగ్డే... ఇపుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోందన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments