Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హీరోలతో ఛాన్సులు... డిమాండ్ పేరుతో వసూలు చేస్తున్న పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో జిగేల్‌రాణిగా మంచి గుర్తింపుపొందిన హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగులో అడుగుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. కానీ, బాలీవుడ్‌లో ఈ అమ్మడు పాచికలు పారలేదు. ఈ క్రమంలో తెలుగునే నమ్ముకుంది. అయితే, తెలుగులో ఆమెకి మళ్లీ ఛాన్సులు రావడం .. నిలదొక్కుకోవడం కష్టమేనని అంతా భావించారు. 
 
కానీ, 'అరవింద సమేత', 'మహర్షి', 'గద్దలకొండ గణేశ్' చిత్రాల విజయాలు ఆమె స్థాయిని పెంచుతూ వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఆమె తన పారితోషికాన్ని పెంచుతూ రావడం విశేషం. 
 
'గద్దలకొండ గణేశ్' సినిమా కోసం కోటికిపైగా పారితోషికాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ జోడీగా చేస్తోన్న సినిమా కోసం రూ.2 కోట్లకి పైగా తీసుకుంటోందట. 'అల వైకుంఠపురములో' హిట్ అయితే ఆమె పారితోషికం రూ.3 కోట్లకు చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మొత్తంమీద తెలుగులో రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన పూజాహెగ్డే... ఇపుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోందన్నమాట. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments