Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ తొలి పోస్ట్... నెట్టింట వైరల్.. ఏం పెట్టారో తెలుసా?

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (12:57 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఖాతాను ఓపెన్ చేశారు. అలా ఖాతా ఓపెన్ చేశారో లేదో గానీ, ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య నిమిషాల్లో లక్షలకు చేరిపోయింది. జూన్ నాలుగో తేదీన ఇన్‌స్టా ఖాతాను తెరిచిన ఆయన తొలి పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. 
 
'ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!' అనే స్లోగన్‌తో ఇన్‌స్టాలోకి పవన్‌ కల్యాణ్ అడుగు పెట్టాగా, ఆయన తొలి పోస్ట్‌ ఏం పెడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయపరమైన ఫొటోలు పెడతారా.. లేదంటే సినిమా విశేషాలు పంచుకుంటారా.. అని అందరూ ఎదురుచూశారు. 
 
తాజాగా ఆయన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. ఆయన చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సినీ ప్రముఖులతోటి దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 
 
"చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను" అని ఆ వీడియో ప్రారంభమైంది. దీనికి "మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ.." అని క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు షేర్‌ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments