Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ తొలి పోస్ట్... నెట్టింట వైరల్.. ఏం పెట్టారో తెలుసా?

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (12:57 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఖాతాను ఓపెన్ చేశారు. అలా ఖాతా ఓపెన్ చేశారో లేదో గానీ, ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య నిమిషాల్లో లక్షలకు చేరిపోయింది. జూన్ నాలుగో తేదీన ఇన్‌స్టా ఖాతాను తెరిచిన ఆయన తొలి పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. 
 
'ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!' అనే స్లోగన్‌తో ఇన్‌స్టాలోకి పవన్‌ కల్యాణ్ అడుగు పెట్టాగా, ఆయన తొలి పోస్ట్‌ ఏం పెడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయపరమైన ఫొటోలు పెడతారా.. లేదంటే సినిమా విశేషాలు పంచుకుంటారా.. అని అందరూ ఎదురుచూశారు. 
 
తాజాగా ఆయన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. ఆయన చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సినీ ప్రముఖులతోటి దిగిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 
 
"చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను" అని ఆ వీడియో ప్రారంభమైంది. దీనికి "మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ.." అని క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు షేర్‌ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments