Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. పవన్‌తో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ జతకలిస్తే ఇక చెప్పనక్కర్

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:25 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. పవన్‌తో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ జతకలిస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రమే 'అజ్ఞాతవాసి'. గతంలో వీరిద్దరూ కలిసి తీసిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. దీంతో 'అజ్ఞాతవాసి'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం కూడా.
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ చిత్రంలో నటించినందుకు హీరోగా పవన్ కళ్యాణ్, దర్శకత్వం వహించినందుకు త్రివిక్రమ్ ఏ మేరకు పారితోషికం తీసుకున్నారనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ మొదలైంది. అయితే, ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు 'అజ్ఞాతవాసి' సినిమాకిగాను త్రివిక్రమ్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకోగా, హీరో పవన్‌కి రూ.30 కోట్ల పారితోషికం ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఇద్దరి పారితోషికమే రూ.50 కోట్ల వరకూ అయిందన్న మాట. ఇక యువ సంగీత దర్శకుడిగా అనిరుథ్ రవిచంద్రన్‌కు రూ.3 కోట్ల వరకూ ముట్టినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments