Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా నిర్మాత నాగబాబు ప్రారంభించిన రైటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ కార్యాలయం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (16:13 IST)
Nagababu with writers team
తెలుగు టెలివిజన్‌ కోసం గతంలోనూ ప్రస్తుతం వ్రాస్తున్న రచయితలందరూ వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నదే రైటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ (వాట్‌). ప్రఖ్యాత సినీ, టీవీ రచయిత డా. సాయిమాధవ్‌ బుర్రాగారు హైదరాబాద్‌ పుప్పాలగూడలోని తన ఆపీసును ‘వాట్‌’కు ఉచితంగా ఇచ్చారు. శుక్రవారంనాడు కార్యాలయాన్ని మెగా నిర్మాత, రచయిత, నటుడు నాగబాబు ప్రారంభించారు. ఇందులో ఆయన సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రచయితలకు ఆరోగ్యభీమా పథకం అమలు చేద్దామనీ దానికి తోడ్పాటునిస్తానని హామీ ఇచ్చారు. వందమందికిపైగా వున్న ఈ అసోసియేషన్‌లో అందరూ పాల్గొని జయప్రదం కావించారు. 
 
పెద్దల ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటామని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి. శశాంక, అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతివారు ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలో సీనియర్‌ రచయితలను కూడా కలిసి సభ్యత్వం తీసుకుని, వృద్ధ రచయితలకు అండగా వుండాలనీ, ప్రస్తుతం టీవీలకు రాస్తున్న అందరినీ ఏకదాటిపై తీసుకువచ్చి వారి సమస్యలకు కార్యాచరణ చేస్తామని ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ఉషారాణి, అడ్వయిజర్‌ రవికొలికపూడి, కార్యవర్గం సభ్యులు అంజన్‌, ప్రభు, వెంకటేష్‌బాబు, మహేంద్రవర్మ, ఫణికుమార్‌, రామారావు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments