Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో సిద్ధార్థ్ కు స‌ర్జ‌రీ - రాగానే కలుస్తాడు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (20:33 IST)
Siddharth
హీరో సిద్ధార్థ్‌కు లండ‌న్‌లో స‌ర్జ‌రీ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని మ‌హా స‌ముద్రం ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి వెల్ల‌డించాడు. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న కూడా రావాల్సివుంది. కానీ స‌ర్జ‌రీ నిమిత్తం విదేశాల్లో వుండ‌డం వ‌ల్ల రాలేక‌పోయాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌హాస‌ముద్రం షూటింగ్‌లో ఏదైనా గాయ‌మైందా. లేదా హిందీ సినిమా షూటింగ్‌లో ఏదైనా జ‌రిగిందా? అనేది క్లారిటీలేదు. కానీ వ్య‌క్తిగ‌త ఆరోగ్య‌రీత్యానే స‌ర్జ‌రీవ‌ర‌కు వెళ్ళింద‌ని తెలుస్తోంది. సూచాయిగా ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేశాడు. 
 
ఇక ఆయ‌న రాగానే త్వ‌ర‌లో మ‌ర‌లా మ‌హాసముద్రం టీం మొత్తం క‌లిసి సెల‌బ్రేష‌న్ చేసుకుంటామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నామ‌ని తెలిపాడు. మ‌హాభార‌త క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా నిర్మించారు. ఇందులో శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ అన్న‌ద‌మ్ములా. లేక స్నేహితులా అనేది చెప్ప‌కుండా సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందేన‌ని అజయ్ భూపతి అంటున్నాడు. ఇందులో `మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా` అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ భూపతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments